telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతి లోక్‌సభ ప్రజలకు సీఎం జగన్‌ లేఖ…

cm jagan

ఏపీ ముఖ్యమంత్రి, జగన్‌ తిరుపతి ప్రజలకు లేఖ రాసారు. అధికారంలోకి వచ్చినప్పటి  నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు చెబుతున్నారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖ పై జగన్‌ సంతకం చేశారు. ఇక వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని లేఖలో జగన్ అభ్యర్ధించారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను లేఖలో జగన్ ప్రస్తావించారు. ఈ లేఖలను లబ్ధిదారులకు వైసీపీ నేతలు అందించనున్నట్టు చెబుతున్నారు. ఇక మరో పక్క తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈనెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొననున్నట్లు చెబుతున్నారు. తిరుపతిలో తాజా పరిణామాలతో జగన్ ప్రచారానికి రావాలని భావిస్తున్నారని చెబుతున్నారు.  అయితే దీనిపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. నిజంగా జగన్‌ తిరుపతి వస్తే దాదాపు రెండేళ్ల తర్వాత ప్రచారంలో పాల్గొన్నట్లు అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది

Related posts