టీడీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘
కరోనా నుంచి చంద్రబాబు వేగంగా కోలుకోవాలని… ఆయన ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కాగా.. తాను కరోనా బారిన పడినట్లు చంద్రబాబు మంగళవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022