telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ రోజు రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టండి: సీఎం జగన్

cm jagan ycp

గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్న వలంటీర్లకు మద్దతుగా ఏపీ సీఎం జగన్ ఓ సందేశం అందించారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అందరూ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ వలంటీర్లను అభినందించాలని తెలిపారు. తన నివాసం నుంచి సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.

గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ వ్యవస్థకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి అభినందనలు చెప్పాలని తెలిపారు.

Related posts