ఏపీ సీఎం జగన్ నేటి శ్రీశైలం పర్యటన రద్దయింది. అక్కడి జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.సాగునీటి అవసరాల కోసం ] ప్రాజెక్టు పరిస్థితులను సమీక్షించడం కోసం జగన్ నేడు శ్రీశైలంలో పర్యటించాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా గత రాత్రి సంభవించిన ప్రమాదంలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి.
ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని సీఎం జగన్ అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పర్యటనను రద్దు చేసుకున్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కొత్త డ్రామా: లోకేశ్ ఫైర్