రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు, ప్రార్థనల కోసం ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. కొత్తగా నమోదైన కేసుల్లో చాలా మంది ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నవారేనని తెలిపారు.
ఢిల్లీ వెళ్లిన వారు, కాంటాక్ట్లో ఉన్నవారు ముందుకొచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించి పరీక్షలు చేసి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అర్భన్ ప్రాంతాల్లో కరోనా నియంత్రణపై పూర్తి సమాచారాన్ని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.
చంద్రబాబు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు: విజయసాయిరెడ్డి