కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్ అన్నారు. కరోనాపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. కోవిడ్ చికిత్సకోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లు మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కోసం ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
రానున్న 6 నెలల కాలానికి వైద్య సేవలకోసం పారామెడికల్ సిబ్బంది, డాక్టర్ల నియామించ నున్నట్టు చెప్పారు. ఇదికాక కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
రఫేల్పై చర్చ అంటే మోదీ పారిపోతున్నారు: రాహుల్