telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్లాక్‌ ఫంగస్‌ పై ముఖ్యమంత్రి జగన్ సూచనలు…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించండి. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని అధికారులకు సీఎం ఆదేశాలు జాతి చేసారు. ప్రతి ఆస్పత్రినుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్‌డెసివర్‌ బ్లాక్ మార్కెట్ కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్‌ అధికారులు బుక్‌ చేసిన కేసులపై చర్యలుండాలన్నారు సీఎం జగన్.

Related posts