కేంద్రంలోని మోడీ సర్కార్ కక్షతో వ్యహరిస్తూ టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేయిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు దీక్షకు దిగనున్నారు.రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని కేంద్రం చేస్తున్న ఐటీ,దాడులను నిరసిస్తూచంద్రబాబు దీక్షకు దిగనున్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీసేందుకు గాను ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. టీడీపీ అభ్యర్థులు పుట్టా సుధాకర్ యాదవ్, పి. నారాయణ, ఉగ్ర నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో కూడ శుక్రవారం నాడు ఐటీ సోదాలు జరిగాయి. ఈ దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు అంబేద్కర్ విగ్రహల వద్ద టీడీపీ నేతలు నిరసనలకు దిగనున్నారు.