ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ లో దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది
మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు.ముఖ్యంగా కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
అలాగే ఈ నెల 27నఅమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి నిధులు విడుదలకు ఆమోదముద్ర వేసింది.
ఏపీ కేబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు:-
*మూడవ విడత అమ్మఒడి పథకం అమలుకు ఆమోదం
*43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు
*కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు
*సంక్షేమ కేలండర్కు మంత్రిమండలి ఆమోదం
*వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఆమోదం
*రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 3,530 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
*ఈ నెల 27న అమ్మఒడి నిధులు విడుదల
*జులైలో విడుదల చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపునేస్తం, జగనన్న తోడు పథకాల 3వ విడత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం
*రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు ఆమోదం
*రూ.15 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్
*దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలకు ఆమోదం
*వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.216 కోట్ల మంజూరు ఆమోదం
*అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
*జగనన్న ఎంఐజీ లే ఔట్ల అభివృద్ధి పాలసీకి ఆమోదం
*సత్యసాయి జిల్లాలో 2వ పట్టణ పోలీస్స్టేషన్ ఏర్పాటు