ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు – నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి.
నేరస్థుడే రాజకీయ పార్టీ అధినేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశాం. కొంతమంది అవసరాలకు తప్పుచేస్తారు, కొంతమంది అత్యాశతో తప్పుచేస్తారు, కొంతమంది డబ్బుల ఉన్మాదంతో తప్పుచేస్తారు, డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థలను సర్వనాశనం చేశారు.
మేం విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది.
మద్యపాన నిషేధమన్నారు, లిక్కర్ ఔట్లెట్స్ తగ్గిస్తామన్నారు, అన్నీ మరిచారు ప్రజలకు ఒక హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలి.
ఆఖరికి ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారన్నారు కానీ మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయాయి.
తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారు, గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.
పరిపాలన ప్రజల కోసం చేయాలి సంక్షేమం, అభివృద్ధి బేరీజు వేసుకుంటూ వెళ్లాలి ఆఖరికి ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు.
పొగురు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగింది.. మరి ఏపీలో తగ్గింది తగ్గిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు పెద్ద కంపెనీలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు.
చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్ ఇవ్వకుండా వేధించారు ఇష్టం లేని బ్రాండ్లన్నీ షాపుల్లో ఉంచేశారు వాళ్లు ఏ కంపెనీ బ్రాండ్లు పెడితే అవే తాగే పరిస్థితి.
మద్యం అనేది ఒక వ్యసనం పేదవాడు శారీరకంగా కష్టపడి ఆ బాధలు మరచిపోయేందుకు తాగుతాడు పేదవాడి మద్యం అలవాటును బలహీనంగా చేసుకుని దోచుకున్నారు.
పేదవాడికి అమ్మే లిక్కర్పై విపరీతంగా ధరలు పెంచేశారు డిస్టలరీలను వైసీపీ నేతలు పంచుకున్నారు, ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారు లోకల్ బ్రాండ్ల కంపెనీలు విపరీతంగా పెరిగాయి.
సొంత మద్యం బ్రాండ్లను తీసుకొచ్చారు భూంభూం పేరుతో రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారు : సీఎం చంద్రబాబు