telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మళ్ళీ చంద్రబాబు రావాలని.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ..

ap ambassidor on next cm

9వ తరగతి చదివే వైష్ణవి ని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన విషయం గుర్తుందా? గత సంవత్సరం చంద్రబాబును కలిసిన వైష్ణవి, అమరావతి నిర్మాణానికి తాను దాచుకున్న లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఆమె నిబద్ధతను ఎంతో మెచ్చుకున్న చంద్రబాబు, ఆమెను అమరావతి ప్రచారకర్తగా నియమించారు.

తాజాగా వైష్ణవి, మరోమారు సీఎంగా చంద్రబాబే రావాలంటూ ప్రత్యేక పూజలు జరిపి మొక్కుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున రూ. 10 వేలు హుండీలో వేస్తానని శ్రీ సువర్చాలా సమేత ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాములకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసింది.

తన తండ్రి డాక్టర్‌ మనోజ్‌ తో కలిసి ఈ పూజలు చేసిన వైష్ణవి, తాను ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వరస్వామికి రూ. లక్ష కానుకగా సమర్పించి చంద్రబాబు గురించి మొక్కుకున్నానని తెలిపింది.

Related posts