భారత సారథి విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి శీతల దేశం స్విట్జర్లాండ్లో విహరిస్తున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచు కొండల్లో నిల్చుని రూపొందించిన వీడియోలో విరుష్క జంట అందంగా కనిపించింది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ ‘అందమైన ప్రదేశం నుంచి మీ అందరికి ముందస్తు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నాడు. అనుష్క మాట్లాడుతూ .. 2019 మీ అందరికీ సంతృప్తికరంగా గడిచిందని ఆశిస్తున్నా. 2020 మరింత బాగా ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు.. అని పేర్కొంది.
next post