telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

అంతర్వేది ఘటనపై విచారణ జరపాలి: స్వరూపానందేంద్ర స్వామి

swarupananedra swamy

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ రథం గత రాత్రి అగ్నికి ఆహుతైంది. షెడ్డులో ఉన్న రథానికి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటనపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు.

అంతర్వేది ఘటన దురదృష్టకరమని అన్నారు. రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమని చెప్పారు. రధోత్సవంలోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోవలని కోరారు.

Related posts