ఉ.కొరియా ఆదివారం తమ దేశంలోని సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ‘అత్యంత ప్రధానమైన’ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికార వార్తా సంస్థ కెసిఎన్ఎ వెల్లడించింది. అయితే ఈ సొహె రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని మూసివేస్తామని ఉ.కొరియా ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు. ఈ రాకెట్ కేంద్రం మూసివేయటానికి విధించిన గడువు సమీపిస్తుండటంతో, నిలిచిపోయిన అణు చర్చలు పున్ణప్రారంబించకపోతే తాము ‘కొత్త మార్గాన్ని’ అనుసరిస్తామన్న హెచ్చరిక పంపేందుకే ఉ.కొరియా ఈ ప్రయోగం నిర్వహించిందని భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ ప్రయోగం పూర్తి విజయవంతమైందని కెసిఎన్ఎ తన వార్తా కథనాలలోవెల్లడించింది. అసలు ఏమి ప్రయోగించారన్న విషయాన్ని మాత్రం వివరించలేదు.