telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో”… మరో బాలీవుడ్ సంగీత దర్శకుడు

Saaho

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం “సాహో”. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. దాదాపు 300 కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందుతుంది. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడి వంటి అగ్ర తార‌లు న‌టిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయనున్నారు చిత్రబృందం. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా “సాహో” నుంచి తప్పుకున్నట్టు సంగీత త్రయం శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌ ప్రకటించారు. దీంతో నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను వెతికే ప‌నిలో పడింది. ఇటీవ‌ల జిబ్రాన్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు ప్రీత‌మ్ పేరు విన‌ప‌డుతుంది. “సాహో” వంటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు రెండు నెల‌ల కాలంలో పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించ‌డం అంటే సులువు కాదు.. ప్రీతమ్‌కు పెద్ద స‌వాలేన‌ని చెప్పాలి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

Related posts