హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో రైలు లిమిటెడ్ కు మరో అవార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన మెట్రోకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ (ఐఈఎస్) గోల్డ్ మెడల్ అవార్డును ప్రదానం చేసింది. ఇటీవల మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును మలేషియా డిప్యూటీ మినిస్టర్ మహమ్మద్ భక్తియార్ బిన్ వాన్చిక్ చేతుల మీదుగా ఎల్ అండ్ టీ మెట్రో హెడ్-కార్పొరేట్ కమ్యూనికేషన్ అనిన్దితా సిన్హా అందుకున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ మెట్రోరైలుకు నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి అన్నారు. రెండు కారిడార్లలో పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మెట్రో ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు, పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ఈ అవార్డుతో గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీ్సకు సీఈవో కేవీబీ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.