దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలతో పాటు ధియేటర్లు కూడా మూతపడ్డాయి. ఈ సమయంలో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తూ వచ్చారు.మార్చి చివరి వారంలో మూతపడిన ధియేటర్లు దాదాపుగా ఆరు నెలల తర్వాత రీఓపెన్ అవుతున్నాయి. అయితే అన్ లాక్ 5.0లో భాగంగా కేంద్రం అక్టోబర్ 15 నుంచి ధియేటర్ లకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినిమా థియేటర్లలో పాటించాల్సిన నియమాలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. 50% మించి థియేటర్లలో ప్రేక్షకులను అనుమతించవద్దంది. థియేటర్లలో భౌతికదూరం పాటించాలని, ఖాళీగా వదిలేసిన సీట్లపై మార్కింగ్ వేయాలంది. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత కరోనా లక్షణాలులేని ప్రేక్షకులను మాత్రమే ధియేటర్ లోకి అనుమతించాలంది. ఇక సినిమా హాళ్ళలో ప్రేక్షకులు ఫేస్ మాస్క్లు ధరించడం తప్పనిసరి అని, అటు బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ కౌంటర్లు రోజు మొత్తం ఓపెన్ చేసి ఉంచాలంది. ఇక సినిమాకి ముందు లేదా బ్రేక్ సమయంలో కరోనా గురించి అవగాన కల్పించే విధంగా నిమిషం నిడివితో ఉన్న ప్రకటనను వేయాలని సూచించింది. ప్యాకేజీ చేసిన ఆహారపానీయాలు మాత్రమే అనుమతించబడతాయని వెల్లడించింది. అలాగే, ఆరోగ్య సేతు యాప్ ను తప్పక వాడాలని సూచించింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని పేర్కొంది.
Announced the Standard operating procedures, SOP’s for cinema halls, multiplexes etc. for screening of films, as they reopen from 15th of October as per Ministry of Home Affairs guidelines.#UnlockWithPrecautions pic.twitter.com/X1XZFZoDAT
— Prakash Javadekar (@PrakashJavdekar) October 6, 2020
రోజాపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు