telugu navyamedia
సినిమా వార్తలు

వివాదంలో చిక్కుకున్న‌ సింగర్ శ్రావణ భార్గవి..

టాలీవుడ్‌ ప్రముఖ గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె తాజాగా వివాదానికి కారణం ఆమె పాడిన పాటే..తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది.

శ్రావణ భార్గవి తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’.. అనే కీర్తననును హమ్మింగ్ చేస్తూ తన మనోభావాన్ని కళ్ళలో చూపిస్తూ ఆ పాటను చిత్రీకరించింది. ఆ పాటను తన యూట్యూబ్ పేజ్ మూడు రోజుల క్రితం పోస్ట్ చేశారు. తన అందాలను చూపిస్తూ.. తనను తాను అన్వయించుకుంటూ ఆ పాట చిత్రీకరించడం..

అన్నమాచార్యుల వారి సంకీర్తనలను అవమానించిందంటూ.. ఆయన వంశస్థుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శృంగార సంకీర్తన పట్ల గాయని శ్రవణా భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు మండిపడుతున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు.

అలాగే ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతరాహిత్యంగా సమాధానిచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు.

Related posts