telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పరీక్షల్లో ఏపీ మంత్రికి నెగెటివ్!

minister anil kumar

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 300కు చేరింది. దీంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

ఈనెల 5న నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే తన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అనిల్ ను సదరు వైద్యుడు కలిసినట్టు తెలుస్తోంది. దీంతో, అనిల్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు 36 గంటల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. కరోనా నెగెటివ్ రావడంతో తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనిల్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Related posts