‘సరిలేరు నీకెవ్వరు’తో వరుసగా ఐదో హిట్ను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఎఫ్ 3పై క్లారిటీని ఇచ్చేశారు దర్శకుడు అనిల్. ఈ మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్లు మరోసారి కనిపించనున్నారని అనిల్ స్పష్టతను ఇచ్చేశారు. ఎఫ్ 2ను మించిన ఫన్ ఎఫ్ 3లో వెంకటేష్, వరుణ్ తేజ్ల మధ్య ఉండబోతోంది. ఎఫ్ 3 స్క్రిప్ట్ పనుల్లో ప్రస్తుతం మా టీమ్ బిజీగా ఉంది. హీరోయిన్లుగా తమన్నా, మోహ్రీన్ ఈ మూవీలో కంటిన్యూ అవ్వబోతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది అని అనిల్ చెప్పారు.
సౌత్లో హీరోలను చూడటానికే థియేటర్స్కు వస్తారు : రకుల్ ప్రీత్ సింగ్