telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక విధానం పై జగన్ కు కన్నా లేఖ

Kanna laxminarayana

ఇసుక విధానం పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ లేఖ రాశారు. ఇసుక విధానంలో తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వల్ల నిర్మాణ రంగంపైనే కాకుండా దాని అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి లేక లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరుతుందని అభిప్రాయపడ్డారు. దయచేసి వెంటనే ఇసుక విధానం ధరలను ఖరారు చేయాలని కన్నా కోరారు. ఇసుక విధానం ఖరారు చేసి నిర్మాణ రంగం కార్మికులను కాపాడాలని జగన్ కు కన్నా విజ్ఞప్తి చేశారు.

Related posts