telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడే ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం..

ఆంధ్రప్రదేశ్‌లో నేడు నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది..మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. గడిచిన మూడురోజులుగా మంత్రివర్గం కూర్పుపై ఎన్నో మంతనాలు సాగించిన సీఎం.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి తుదిజాబితాను ఖరారు చేశారు.

ఇవాళ ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్‌ స్థలంలో.. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇప్పటికే నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాను గవర్నర్ ఆమోదం తెలిపారు..ఇప్పటివరకు మంత్రులుగా కొనసాగిన వారిలో 11 మందికి కొత్త కేబినెట్‌లోనూ స్థానం దక్కింది.

కాగా, 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. 25 మందితో తొలి కేబినెట్‌ ఏర్పాటు చేశారు. అయితే, ముందుగా చెప్పినట్లు వారందరితో ఈనెల 7న రాజీనామా చేయించారు. కొత్తవారితో నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. 11 మంది సీనియర్లకు మంత్రివర్గంలో మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం వైఎస్ జగన్..

సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, అంజాద్‌ బాషా, బుగన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామిలకు మరోసారి అవకాశం వచ్చింది.

కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు… ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌‌కు మంత్రి పదవులు ఇచ్చారు..

గత కేబినెట్‌లో 44 శాతం మంది.. కొత్త మంత్రివరంలో చోటు దక్కించుకున్నారు. చిత్తూరు నుంచి అత్యధికంగా ముగ్గురికి కొత్త మంత్రివరంలో చోటు లభించింది. ఆ 8 జిల్లాల నుంచి ఒక్కరికీ ప్రాతినిథ్యం లేదు..: నూతన మంత్రివరంలో చోటు దక్కించుకున్న వారిలో 8 మంది ఓసీలు, అయిదుగురు ఎస్సీలు, 10 మంది బీసీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీ వరాల నుంచి చెరొకరికి అవకాశం లభించింది.

గత మంత్రి వర్గంలో ముగురు మహిళలు ఉండగా..ఈసారి నలుగురు ఉన్నారు. మొత్తం 26 జిల్లాల్లో 8 జిల్లాల నుంచి ఒక్కరికీ నూతన మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లభించలేదు. అల్లూరి సీతారామరాజు, విశాఖ, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల నుంచి ఎవరూ మంత్రులు కాలేకపోయారు.

మ‌రోవైపు..ఇవాళ ప్రమాణస్వీకారం తర్వాత.. శాఖలు కేటాయించనున్నారు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Related posts