మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కరోనా బారిన పడిన ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో కోద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్కు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తరవాత అస్వస్థతకు గురవడంతో ఆయన ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కోమాలోకి, చివరకు డీప్ కోమాలోకి వెళ్లిన ఆయన కొన్ని గంటల క్రితమే సెప్టిక్ కోమాలోకి వెళ్లారు. చివరకు తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. తాజాగా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. మంచి రాజకీయ నాయకుడు, భారత రత్న అవార్డ్ అందుకున్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యుల కు తన విచారాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థంగా వ్యవహరించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్టు ప్రకటించారు.
previous post