ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 1:29లకు కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. ఖాళీ అయిన రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు రాజ్ భవన్ కు చేరుకొని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
previous post