telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈరోజు నుంచే అకౌంట్లలోకి డబ్బులు..

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో రైతులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చేసింది. ఖరీఫ్ పంటకాలానికి వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్…. ఈ ఆర్థిక ఏడాదికి చెందిన తొలి విడత సహాయాన్ని ఇవాళ రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. “వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం” కింద అందించే ఈ కార్యక్రమాన్ని సిఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది తొలి విడత సహాయంగా రూ.7500 జమ చేయనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.2000 ఉండనుంది.. ఇక ఈ కార్యక్రమం వల్ల 52.38 లక్షల మంది రైతులకు లబ్ది జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం తొలి విడతగా రూ. 3882 కోట్లు విడుదల చేయనుంది ఏపీ సర్కార్.

Related posts