బుల్లితెర యాంకర్గా ‘పటాస్’ షోతో ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ ఛాన్స్ పట్టేసి తెగ హంగామా చేసింది. విన్నర్ అవుతుందనుకుంటే చివరకు రన్నర్ ట్రోఫీతోనే సర్దుకుంది. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఇక లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు పలు ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం శ్రీముఖి గోవాలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్స్ యాంకర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు పలువురు స్నేహితులతో కలిసి గోవాలోని కోలా బీచ్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి. గోవా ట్రిప్ మూడో రోజు.. వాటర్ బేబీ.. ఐ డోంట్ వన్నా కమ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేసింది శ్రీముఖి. దీంతో ఆ ఫోటోలు కాస్త వైరల్గా మారాయి.
previous post
next post