యాంకర్ అనసూయకు అంటే పెద్దగా పరిచయం అవసరం పేరు ..ఈ మధ్య కాలంలో గ్లామరస్ రోల్స్ చేస్తూ టాలీవుడ్లో ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతోంది. ఇటీవల రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో మెరిసిన అనుసూయ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో కనిపించి కనువిందు చేసింది.
ఇదిలా ఉండగా యూట్యూబ్లో అభ్యంతరకర థంబ్నెయిల్స్పై అనసూయ తీవ్రంగా స్పందించారు. తనపై చేస్తున్న ట్రోలింగ్పై తీప్పుకొడుతూ అనసూయ ఘాటుగా స్పందించింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన అనసూయ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాయి అని అనసూయ మండిపడింది.
ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ చూశాను. ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు అంటూ పెడుతుంటారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి.
ఇక నేను లావు కావడం, తగ్గడం అది నా వ్యక్తి గతం. యూట్యూబ్ ఛానల్స్ వారి దిగజారుడు తనాన్ని ఎలా సమర్ధించుకుంటాయి. నేనూ వారిలా మాట్లాడగలను కానీ నాకు వ్యక్తిత్వం ఉంది అని అనసూయ పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.