telugu navyamedia
సినిమా వార్తలు

పూర్తి స్థాయి థ్రిల్లర్ “కథనం”… : అనసూయ

Kathanam

ది గాయత్రి ఫిలిమ్స్ మరియు ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించగా.. బి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 9న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయగా… ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రోషన్ చక్కని నేపథ్య సంగీతం అందించాడు. రేపే ఈ సినిమా విడుదలవుతుండటంతో ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. తాజాగా అనసూయ మాట్లాడుతూ “ఈ సినిమా చేయడానికి ముందు నేను 12 కథలు విన్నాను. అవేవీ నాకు కొత్తగా అనిపించలేదు. ఆలస్యమైనా వైవిధ్యభరితమైన కథలనే చేద్దామని వెయిట్ చేస్తుండగా ‘కథనం’ నా దగ్గరికి వచ్చింది. ‘కథనం’ నేను ఎందుకు చేశానన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో థ్రిల్ చేస్తుంది. మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందనే నమ్మకం వుంది” అంటూ చెప్పుకొచ్చింది.

Related posts