telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందరూ నన్ను క్షమించండి : అనసూయ

Anasuya

ఒకవైపు బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ గా… మరోవైపు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. గత ఏడాది రామ్ చరణ్, సమంత కలిసి నటించిన “రంగస్థలం”లో అనసూయ “రంగమ్మత్త” అనే పాత్రలో నటించింది. రంగమ్మత్త పాత్రతో ప్రత్యేకమైన గుర్తింపును పొందింది అనసూయ. ఈ పాత్రకిగాను “జీ సినిమా అవార్డ్స్ 2018” వేడుకలో అవార్డును సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

ఇలా తొలి అవార్డును అందుకున్న అనసూయ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “జీ సినిమా అవార్డ్స్” నుంచి రంగమ్మత్త పాత్రకిగాను తొలి అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఈ అవార్డుకిగాను నన్ను ఎంపిక చేసినవారికి వారికి ధన్యవాదాలు… అవార్డును గెలిచిన ఆనందంలో నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. అప్పుడు నా స్పీచ్ పెద్ద డిజాస్టర్ అని నేను భావిస్తున్నాను. మైత్రీ మూవీ మేకర్స్… చరణ్ .. రత్నవేలు .. దేవిశ్రీ… నా భర్త… అమ్మానాన్నలకీ, ‘రంగస్థలం’ సిబ్బందికి వేదికపై థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయాను. మీరంతా కూడా నా క్షమాపణలను అంగీకరించాలని కోరుతున్నాను” అంటూ పోస్ట్ చేసింది.

వైఎస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “యాత్ర”లో మీ పాత్ర ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నకు… ఇప్పుడు నేను ఆ విషయాన్నీ చెప్పలేను. కానీ ఆ పాత్ర కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది. అలాగే అభిమానులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొచ్చింది. “రంగస్థలం”తో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Related posts