telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులపై పడ్డ ప్రతీ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుంది: పవన్

pawan-kalyan

రైతుల ఒంటి మీద పడ్డ ప్రతీ దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులను శాంతిభద్రతలకు వాడకుండా రౌడీలుగా మార్చారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులను కొట్టిన లాఠీలకు మేకులు ఉన్నాయని బాధితలు చెబుతున్నారని, పోలీసుల ముసుగులో రౌడీ మూకలే దాడి చేశాయని పవన్ ఆరోపించారు.

వైసీపీ నేతల భూములు అమరావతిలో ఉండి ఉంటే రాజధానిని కదిలించే వాళ్లు కాదేమో అని వ్యాఖ్యానించారు. వారికి సంబంధించిన భూములన్నీ విశాఖలోనే ఉన్నాయని, అందుకే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో విశాఖకు రాజధానిని తరలించడం లేదన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామంటేనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.

Related posts