telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అనంతపురం జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

Two sons murder after father sucide

అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. తనకల్లు మండలం కొర్తికోటలో జరిగిన ఈ ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నాడు. వీరిని హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Related posts