telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉగాదికి రానున్న ‘అమృతం’ సీరియల్‌

amrutam

‘అమృతం’ బుల్లి తెరపై వీక్లీ సీరియల్‌గా ఆరు సంవత్సరాలపాటు ప్రసారమైంది. పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళీ లొల్లి చెయ్యడానికి, ప్రేక్షకులను కవ్వించి నవ్వించడానికి లైట్ బాక్స్ మీడియా ప్రీమియర్ ఎక్సక్లూసివ్‌గా జీ5లో ప్రసారం కాబోతుంది. బుల్లి తెరపై వీక్లీ సీరియల్‌గా ఆరు సంవత్సరాలపాటు ప్రసారమైంది. పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళీ లొల్లి చెయ్యడానికి, ప్రేక్షకులను కవ్వించి నవ్వించడానికిలైట్ బాక్స్ మీడియా ప్రీమియర్ ఎక్సక్లూసివ్‌గా జీ5లో ప్రసారం కాబోతుంది.‘అమృతం’ 2001 లో సిట్ కామ్‌గా ప్రారంభమై బుల్లి తెర వీక్షకులకు హాస్యాన్ని పంచి పెట్టింది. ఆంజనేయులు, అమృత రావు అనే ఇద్దరు స్నేహితులు కలిసి తమ రెస్టారెంట్ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి విన్నూత్నమైన ఐడియాస్ వేస్తుంటారు కానీ వాటిని అనుకోని సంఘటనలు, సందర్భాలు పలకరించడంతో చతికిలపడుతుంటారు. ఈ సిట్ కామ్‌లో శివాజీ రాజా, నరేష్, హర్ష వర్ధన్, గుండు హనుమంత రావు ప్రధాన పాత్రల్లో నటిస్తే, వాసు ఇంటూరి, సర్వం అనే నమ్మకస్తుడైన పనివాడి పాత్ర పోషించగా, శివన్నారాయణ హింసించే ఇంటి ఓనర్ అప్పాజీ పాత్రలో నటించారు.
అమృతం ద్వితీయం లో హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా,యల్బి శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ ఉగాది నుంచి మీ జీ5లో ప్రసరమౌతుంది.

Related posts