బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిలో భాగంగా రేపటి నుంచి దేశ వ్యాప్త సభ్యత్వ నమోదును ప్రారంభించనుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ మరింత దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.
దానికి సమాధానంగా.. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శంషాబాద్లో సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులను, కుల పెద్దలను సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
హత్యలకు బీహార్ కేంద్రంగా మారింది: గులాం నబీ అజాద్