telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హోలీ వేడుకలకు అమిత్​ షా దూరం

amith shah bjp

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హోలీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకలకు దూరంగా ఉంటానని బుధవారం ఉదయమే ప్రకటించారు. కొద్దిగంటల్లోనే అమిత్ షా, జేపీ నడ్డా తాము కూడా దూరంగా ఉంటామంటూ ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. వీలైనంత వరకు ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా ఉండాలని సూచించారు.

భారతీయులకు హోలీ ఎంతో ముఖ్యమైన పండగ. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడే కార్యక్రమాలు వద్దు. మీరు, మీ కుటుంబ ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోండని అమిత్ షా ట్వీట్ చేశారు.

Related posts