telugu navyamedia
రాజకీయ వార్తలు

మా దృష్టిలో పేదలు అనే కులం మాత్రమే ఉంది: అమిత్ షా

amith shah bjp

తమ దృష్టిలో పేదలు అనే ఒకే కులం మాత్రమే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ లోని ఛాత్రాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, జేఎంఎం పార్టీల మాదిరి బీజేపీ కుల రాజకీయాలకు పాల్పడదని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.

కూటమిగా పోటీపై అమిత్ షా మాట్లాడుతూ జార్ఖండ్ యువత ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అణగదొక్కాలని చూసిందో హేమంత్ సోరెన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ ను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని అమిత్ షా గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో జార్ఖండ్ యువత తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధాని వాజ్ పేయి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.

Related posts