బాలీవుడ్ స్టార్, కిలాడీ హీరో అక్షయ్ కుమార్ ఈ ఏడాది బాలీవుడ్లో అతి భారీ విజయాలు అందుకున్న హీరో. ఈ ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ 150 కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లు సాధించాయి. అక్షయ్ నటించిన కేసరి (రూ.154 కోట్లు), మిషన్ మంగళ్ (రూ.202 కోట్లు), హౌస్ఫుల్ 4 (రూ.194 కోట్లు), గుడ్న్యూస్ (రూ.200 కోట్లు) సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. అన్నీ బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లాల్ సింగ్ చద్దా`. ఈ చిత్నాన్ని ఈ ఏడాది కిస్మస్కు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయానికి అక్షయ్ కుమార్ `బచ్చన్ పాండే` చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు వస్తుందని భావించిన ఆమిర్.. అక్షయ్కు ఫోన్ చేసిన మాట్లాడారు. దాంతో అక్షయ్ తన సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీనిపై ఆమిర్ స్పందిస్తూ “కొన్ని సమయాల్లో చిన్న మాటలే ప్రముఖంగా మారుతాయి. మా మిత్రుడు అక్షయ్ కుమార్, నిర్మాత సాజిద్ నడియడ్ వాలాకు థ్యాంక్స్. వారు బచ్చన్ పాండే సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. వారి సినిమాకు నా అభినందనలు” అని ట్వీట్ చేశారు.
previous post