నేటి అర్ధరాత్రి నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ నిన్ననే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రాగా.. ఇవాళ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్లో అనేక ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లను, రాయితీలను అందిస్తున్నారు.
ఈ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్ఫోన్లు, యాక్ససరీలు, ల్యాప్టాప్లు, టీవీలు తదితర ప్రొడక్ట్స్పై అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తున్నారు. అలాగే ఎస్బీఐ కార్డులతో ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ను అందిస్తున్నారు.