telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

పోలీసుల భయంతో పరుగు..గుండెపోటుతో కూలీ మృతి

Crime

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పోలీసుల భయంతో ఓ కూలీ పరుగెత్తుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన చెందిన ఘటన ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో జరిగింది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఊరి చివర ఉన్న చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలిసి అందరూ ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఈ క్రమంలో షేక్ జాఫర్ అనే (55) ఏళ్ల కూలీ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసుల కారణంగా జాఫర్ మృతి చెందాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆడుకుంటున్న పిల్లలను ఇంటికి వెళ్లాలని తుళ్లూరు కానిస్టేబుల్ రామయ్య చెప్పారని, దీంతో వారంతా పరుగులు తీశారని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాఫర్ గుండెపోటుకు గురై మృతి చెందాడని ఆయన వివరించారు.

Related posts