రాజధానిని తరలించాలనే ఆలోచన మంచిది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని పై నెలకొన్న గందరగొలంతో అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళలు మహా ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. మహాధర్నాకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన అన్నారు. అధికారంలో ఉన్న వారు ప్రజల అభివృద్ధిని కాంక్షించాలని ఆయన వైసీపీని డిమాండ్ చేశారు. రైతు సమస్యలతో పాటు రాజధాని కోసం బీజేపీ పోరాడుతోందని భరోసా ఇచ్చారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను మాత్రం స్వాగతిస్తామని చెప్పారు.