telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు: రాజధాని రైతులు

almost no security at chandrababu house

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి భారీ సంఖ్యలో రైతులు మహిళలలు తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ కట్టడాలు కట్టలేదని, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టినవేనని వారన్నారు

.అమరావతిలో చంద్రబాబు నివాసానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాజధాని రైతులు తెలిపారు. ప్రజావేదిక కూల్చివేతను వారు తప్పుపట్టారు. అవినీతి ఎక్కడ జరిగిందో ప్రభుత్వం నిరూపించాలని రైతులు సవాల్ చేశారు. ఇంకా అక్రమకట్టడాలు చాలా ఉన్నాయని, వాటిని ఎందుకు కూల్చలేదని రైతులు ప్రశ్నించారు. సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు.

Related posts