తాజాగా అమల ఇన్స్టాగ్రామ్లో ఓ బోల్డ్ ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమల ఇండోనేషియాలోని బాలిలో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. అడవుల్లో సెలయేరు మధ్య ఉన్న హోటల్లో బాత్ టబ్లో పువ్వుల మధ్య నగ్నంగా కూర్చుని నేచర్ అందాలను ఆస్వాదిస్తూ కనిపించారు. అమల వీపుపై ఉన్న టాటూ మరింత ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. కొందరేమో ఈ ఫొటో చాలా బ్యూటిఫుల్గా ఉందని కామెంట్ చేస్తుంటే మరికొందరు ‘ఆమె 2’ సినిమాకు రెడీ అవుతున్నావా? అంటూ సెటైర్లు వేశారు. ఏదైతేనేం అప్పుడప్పుడూ ఇలాంటి హాట్ ఫొటోలతో అమల ఫ్యాన్స్ను ఖుష్ చేస్తుంటారు. ప్రస్తుతం అమల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీలో మంచి హిట్ అందుకున్న ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘ఆమె’ సినిమాను చూసిన నిర్మాత కరణ్ జోహార్ తెలుగు రీమేక్లో అవకాశం ఇవ్వాలనుకున్నారు. అయితే హిందీలో చూపించినట్లుగా తెలుగు సన్నివేశాలు ఉండవని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్ను నందినీ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేస్తారు. దీంతో పాటు అమల ‘ఆడు జీవితం’, ‘కాడవర్’ అనే సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.
కలెక్షన్ కింగ్ నిజమైన లెజెండ్ : సూర్య