telugu navyamedia
సినిమా వార్తలు

నాది ఏదైనా అది నీదే..అది నీవ‌ల్లే వ‌చ్చింది…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతుంది. శ్రీవల్లి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక లుక్‌ చాలా బావుంది. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది.

‘పుష్ప’ భారీ విజయాన్ని అందుకున్న ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తిరుపతిలో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుక‌లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ .. ఈ సినిమా కోసం తాను పడిన కష్టం కంటే చిత్ర యూనిట్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు అంటూ అందరినీ ప్రశంసల్లో ముంచెత్తారు.

చిత్తూరు భాషను నేర్చుకునేందుకు రెండు సంవత్సరాలు కష్టపడ్డానని, తొలి సక్సెస్‌మీట్‌ను ఇక్కడ నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ ఏడు కొండల స్వామి మీ అందరి వెనుక ఎలా ఉన్నాడో, నా వెనుక సుకుమార్ అలా ఉన్నాడని ..ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలేను అన్నారు .

సుకుమార్‌కు ఎంత ధ్యాంక్స్ చేప్పినా త‌క్కువే.. నాది ఏదైనా అది నీదే..అది నీవ‌ల్లే వ‌చ్చింది. నేను సినిమాలో బాగా న‌టించాను అని అంద‌రూ అంటున్నారు. అది నీ కోరిక..న‌న్ను ఎక్క‌డో పెట్టినంద‌కు ధ్యాంక్యూ.. ఐల‌వ్ యూ ..ఒక భాష కాదు..ఎన్ని భాష‌లు..ఎన్ని చోట్ల ప్ర‌శంస‌లు అందుకుంటుందో సుకుమార్‌కే దక్కుతుందని అన్నారు.

రష్మికతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, శ్రీవల్లిగానే కాకుండా రష్మిక లాగ కూడా ఆమె అంటే ఇష్టమని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారికి చాలా చాలా థ్యాంక్స్ అని అన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని, ముఖ్యంగా ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ అని అన్నారు.

నాకు ఆయనే వెంకటేశ్వరస్వామి.. స్టార్ హీరో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్

ఇక మధ్యలో చిత్తూరు భాషల్లో డైలాగ్‌లు, పాట‌లు పాడుతూ అక్క‌డ ఉన్న‌వారింద‌రి అంద‌రిని ఆక‌ట్టుకున్నారు. అల్లు అర్జున్ ఈ ప్రోగ్రాం కి హైలెట్ గా నిలిచింది

చివ‌రిగా..ఈ సినిమాని దేశ వ్యాప్తంగా , రాష్ర్టాల్లో ర‌క‌ర‌కాల‌గా షేక్ ఆడిస్తున్న నా ఫ్యాన్స్ , నా ఆర్మీ మీ అంద‌రికోసం,మీ ప్రేమ కోసం ఒక డైలాగ్ చెప్పారు. ఆదేందో తెలుసునా సారూ..నా ఒంట్లో పారే నా ఫ్యాన్స్ ఎన‌ర్జీ దీన్ని ఎవ‌రూ వేరు చేయ‌లేరు ..ఇది సార్ నా బ్రాండ్ అని ప‌వ‌ర్ పుల్ డైలాగ్ చెప్పి స్పీచ్ ముగించారు.

Related posts