సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించి పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో బన్నీ ఊరమాస్ లుక్తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
అయితే రెండు పార్ట్లుగా రూపొందిన ఈ చిత్రం తొలి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రానుంది. సెకండ్ పార్ట్ ఏ పేరుతో విడుదల కానుందనేది అందరి అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉండగా దర్శకుడు సుకుమార్ ఆ పేరు రివీల్ చేశారు.
పుష్ప ది రైజ్ మూవీ చివరిలో సెకండ్ పార్ట్కు ‘పుష్ప-ద రూల్’ టైటిల్ పెట్టినట్టు తెలియజేశాడు సుకుమార్. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పుష్ప ది రైజ్తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బన్నీ.. సెకండ్ పార్టులో తన రూలింగ్తో మరింత పీక్స్కు తీసుకువెళ్లనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా హీరో సునీల్, యాంకర్ అనసూయ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.