telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కుప్పం ఘటనపై అల్లు అర్జున్… మృతుల కుటుంబాలకు 2 లక్షలు…!

AA

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ బర్త్ డే వేడుకల్లో దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ప్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందినవారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్, వకీల్ సాబ్ టీం ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల రూపాయలు అందించనున్నట్టు పేర్కొన్నారు. తాజాగా ఈ ఘటనపై మెగా హీరో అల్లు అర్జున్ స్పందించాడు. తన సోషల్ మీడియా వేదికగా మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ… ఒక్కో కుటుంబానికి తానుకూడా రూ.2లక్షల రూపాయలు అందించనున్నట్టు తెలిపాడు. అలాగే స్వయంగా ముందుకు వచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్న అభిమానులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.

Related posts