తమిళంలో సూపర్ హిట్ ప్రేమ కథ అయిన ‘ఓ మై కడవులే’ సినిమా ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతోంది. సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది..
తమిళంలో విజయ్ సేతుపతి పాత్రకు తగిన ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే ఈ తమిళంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర కోసం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇందుకోసం ఓ మై కడవులే తెలుగు రీమేక్ యూనిట్ త్వరలోనే అల్లు అర్జున్ని కలిసేందుకు నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ టాక్.
అయితే ..అల్లు అర్జున్ ఓ సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను చేస్తోన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.