వివాహ బంధంతో ఆర్య, సాయేషా సైగల్ ఒక్కటి కాబోతున్నారు. ప్రీ వెడ్డింగ్లో భాగంగా హైదరాబాద్లో సంగీత్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు తెలుపు వర్ణం దుస్తుల్లో అందంగా మెరిశారు. అల్లు అర్జున్ సంగీత్లో పాల్గొని ఆర్య, సాయేషాకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సంగీత్లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను ఆర్య ట్విటర్లో షేర్ చేశారు.
ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, నీ చేయి విడువను అనే అర్థంతో ట్వీట్ చేశారు. ఇవే ఫొటోలను సాయేషా కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘మై లవ్ ఫరెవర్’ అని కాబోయే భర్తపై ఉన్న ప్రేమను తెలిపారు. ‘గజినీకాంత్’ (2018) సినిమా కోసం ఆర్య, సాయేషా తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ప్రస్తుతం సాయేషా, ఆర్య కలిసి ‘కాప్పన్’ చిత్రంలో నటిస్తున్నారు.
సుశాంత్ డ్రగ్స్ కోసం వేధించేవాడు… రియా సంచలన వ్యాఖ్యలు