2020 లో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ రాజధానిలో జరిగిన భారీ పేలుడు వందల మందిని పొట్టన పెట్టుకుంది. ఓ ప్రక్క కరోనా వైరస్ తో అల్లాడుతున్న ప్రప్రంచం పలు దుర్ఘటనలతో బెంబేలెత్తుతుంది. నిన్న కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 190 మంది ప్రయాణికులతో కూడిన విమానం లాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్స్ తో పాటు మొత్తం 17 మంది మరణించినట్లుగా తెలుస్తుంది. దేశాన్ని ఈ సంఘటన తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా ఈ ఘటనపై మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సంఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహేష్ ట్విట్టర్ లో ”కోజికోడ్ విమానప్రమాద ఘటన కలచివేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికిని నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడివారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.
కేరళలో జరిగిన ఈ విమాన ప్రమాదం విషాదాన్ని నింపిందని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. కోజికోడ్లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపాడు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.