ఆంధ్రప్రదేశ్లో ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. మంగళవారం సాయంత్రం కొంతమంది కర్రలు చేతబట్టుకుని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి చొరబడి కార్యాలయంలో కనపడినవారిపై దాడి, అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. పలు విలువైన వస్తువులు ధ్వంసం చేశారు.
దాంతో కార్యాలయంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మీద టీడీపీ నేతలు ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు గంజాయి మాఫియాలో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తూ టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. వైసీపీ నేతలు, ఏపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే టీడీపీ కార్యాలయంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేశారు.
విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి హుటాహుటిన బయల్దేరారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి టీడీపీ నేతలపై, కార్యాలయాలపై పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు చేయిస్తున్నారని అమిత్ షాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.