telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అల వైకుంఠపురంలో” తిరుపతి ఈవెంట్ రద్దు…?

AY

ఈ సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో..` చిత్రం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో కూడా ఇలాంటి ఓ వేడుకను నిర్వాహించాలని అనుకున్నారు. శుక్రవారం ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే అల్లు అర్జున్ మేనమామ రాజేంద్రప్రసాద్ కన్ను మూయడంతో ఆ ఈవెంట్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. బుధవారంనాడు రాజేంద్రప్రసాద్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఇప్పటికే ప్లాన్ చేసిన ఈవెంట్లన్నింటినీ రద్దు చేసినట్టు తెలుస్తోంది.

Related posts