బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా ఆస్పత్రిలో చేర్చారు. ‘సిండ్రెల్లా’ చిత్రీకరణలో భాగంగా లండన్లో ఉన్న అక్షయ్.. దానిని మధ్యలోనే ఆపి, భారత్కు తిరుగు పయనమయ్యారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు అక్షయ్ తల్లి అరుణ భాటియా. ఈ క్రమంలో తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షిణించటంతో ముంబైలోని హీరానందాని హాస్పిటల్లో చేర్పించారు. అయితే అక్షయ్ తల్లి ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉందని, ఆమెను ఐసీయూలో చేర్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ లండన్ నుండి హుటాహుటిన ముంబై చేరుకున్నాడు. షూటింగ్ నేపథ్యంలో లండన్ లో ఉన్న అక్షయ్ తల్లి అనారోగ్యపాలైందని తెలిసిన వెంటనే ముంబైకి చేరుకోవటంతో ఎయిర్ పోర్ట్ లోని అక్షయ్ కుమార్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా అక్షయ్కి తల్లి అంటే అమితమైన ప్రేమ. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని దగ్గరుండి చూసుకునేవాడట. ఈ క్రమంలో సిండ్రెల్లా మూవీ షూటింగ్ కోసం యూకే వెళ్లిన ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారని తెలియాగానే ఆగ మేఘాల మీద యూకే నుంచి ముంబైకి చేరుకున్నాడు .అక్కడ షూటింగ్ మధ్యలో వచ్చేసిన అక్షయ్ మిగతా నటుల షూటింగ్ జరపాలని డైరెక్టర్ కి చెప్పారని సినీ వర్గాల సమాచారం.